రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగురోజులుగా అంగన్వాడీ వర్కర్స్ &హెల్పర్స్ యూనియన్ వారు సమస్యల కోసం చేపడుతున్న నిరసన దీక్షకు మద్దతుగా శుక్రవారం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ రాయిపురెడ్డి కృష్ణ గారు అంగన్వాడి అక్క చెల్లెళ్లు కే కోటపాడు తాసీల్ధార్ ఆఫీస్ వద్ద చేపడుతున్న నిరసనలో పాల్గొని తమ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 52వేల అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు లక్ష మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు నామమాత్రపు వేతనాలకే పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గ్రాట్యుటి కూడా వీరికి కల్పించాలని జనసేన పార్టీ వీరికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రాయపరెడ్డి కృష్ణ గారు తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్ తాలూకా న్యాయమైన కోర్కెలకు తమ మద్దతు తెలిపి వెంటనే వారికి రావాల్సిన బకాయులను తీర్చాలని ,ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉండగా ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు ఏదైతే గౌరవ వేతనంగా 26 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క హామీని నెరవేర్చాలని గతంలో కూడా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం మీకు పెంచుతామని చెప్పి మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట తిప్పారని రాయప రెడ్డి కృష్ణ గారు నిలదీశారు. ఈ కార్యక్రమంలో కే కోటపాడు మండల జనసేన నాయకులు శ్రీ కుంచా అంజి బాబు గారు చుక్కా నారాయణ మూర్తి భీమవరం రాము శ్రీను గణేష్ శివ కడుపొట్ల గంగు నాయుడు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40